ముషీరాబాద్/ కవాడిగూడ, సెప్టెంబర్ 5: భారీ వర్షానికి ముషీరాబాద్ నియోజకవర్గంలోని బస్తీలు, కాలనీలు జలమయమయ్యాయి. మంగళవారం ఉదయ కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలతోపాటు ప్రధాన రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది. వెంటనే రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది, ఎమర్జెన్సీ బృందాలు వరద సహాయక చర్యలు చేపట్టాయి. రోడ్లపై నిలిచిన నీటిని వెంటనే తొలగించి పరిస్థితిని చక్కదిద్దారు. లోతట్టు ప్రాంతాల్లో ఎమ్మెల్యే ముఠా గోపాల్, అధికారులు పర్యటించి వరద సహాయక చర్యలను పర్యవేక్షించారు. సిబ్బంది సహాయంతో రోడ్లపై నిలిచిన బురద, మట్టి, చెత్తాచెదారాన్ని తొలగించారు.
వరదనీటితో లోతట్టు ప్రాంతాలైన బాపూజీనగర్, గంగపుత్ర కాలనీ, ఆదర్శ్నగర్, వినోబానగర్, గణేశ్నగర్, నాగమయ్యకుంట, అశోక్నగర్, లోయర్ ట్యాంక్బండ్తోపాటు చిక్కడపల్లి, ముషీరాబాద్, విఎస్టీ స్టీల్ బ్రిడ్జి , భోలక్పూర్ ప్రధాన రోడ్లు జలమయమయ్యాయి. అడిక్మెట్ డివిజన్ అంజయ్యనగర్లో వరద నీరు ఇళ్లల్లోకి చేరడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. నాగమయ్యకుం ట బస్తీలోకి వీఎస్టీ స్టీల్ బ్రిడ్జి మార్గం గుండా వరదనీరు వరద నీరు ప్రవేశించి ఇండ్లలోకి చేరిం ది. పరిస్థితి తెలుసుకున్న ఎమ్మె ల్యే ముఠా గోపాల్ నాగమయ్యకుంట, అంజయ్యనగర్లలో ప ర్యటించి స్థానికులకు ధైర్యం చెప్పారు. కోతకు గురైన రోడ్డు స్థానంలో కొత్తగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు హామీ ఇచ్చారు. రోడ్లపై చేరిన బురద, ఇసుకమేటలను జీహెచ్ఎంసీ బృందాలు యుద్ద ప్రాతిపదికన తొలగించాయి. పలు నాలాల వద్ద ఎమర్జెన్సీ బృందాలు వరద నీరు సాఫీగా వెళ్లడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటల వరకు దాదాపు అన్ని రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని వెంట వెంటనే తొలగించి పరిస్థితిని చక్కదిద్దారు.
పురాతన ఇండ్లను కూల్చివేయాలి..
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానల కారణంగా కవాడిగూడ డివిజన్లోని సింగాడికుంట వాంబే కాలనీ పక్కన ఉన్న పురాతన ఇంటి గోడ మంగళవారం కూలింది. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే సంఘటనా స్థలానాన్ని సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పురాతన ఇండ్ల యజమానులకు నోటీసులు జారీ చేసి కూల్చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారును సూచించారు. ముఠా జయసింహ, జి. వెంకటేశ్, కవాడిగూడ డివిజన్ అధ్యక్షుడు ఎంసీ మహేందర్ బాబు, జీహెచ్ఎంసీ డీఈ సన్ని, ఏఈ బి. సుభాష్, సూపర్వైజర్ మహేశ్కుమార్, టౌన్ ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
లక్ష్మి కుటుంబాన్ని ఆదుకుంటాం..
రెండు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానల వల్ల నాలా పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ మేరకు మంగళవారం భోలక్పూర్ డివిజన్ పరిధిలోని దామోదరం సంజీవయ్యనగర్లో నాలా పరీవాహక ప్రాంతాల ప్రజలను కలిసి మాట్లాడారు. వానల వల్ల నష్టపోయిన బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. భోలక్పూర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు వై. శ్రీనివాస్రావు, బింగి నవీన్కుమార్, ఉపాధ్యక్షుడు ఎ. శంకర్గౌడ్, బీసీ సెల్ అధ్యక్షుడు గుండా ఉమాకాంత్ ముదిరాజ్ పాల్గొన్నారు.
లక్ష్మి కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు ..
డీఎస్ నగర్లో అదృశ్యమైన లక్ష్మీ కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు అందజేస్తామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ పేర్కొన్నారు. మంగళవారం ఆమె ఇంటిని సం దర్శించి లక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వివరాలను కటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నా రు. తక్షణ సహాయంగా రూ. 5 వేలు అందజేశారు.
విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే
చిక్కడపల్లి : విద్యార్థులను ఉత్తమ పౌరులు తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని ఎమ్మెల్యే అన్నారు. గాంధీనగర్లోని గీతాంజలి పాఠశాల్లో మంగళవారం టీచర్స్ డే వేడుకులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై ఉపాధ్యాయులను సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలను ఉన్నతంగాతీర్చిదిద్దడంలో టీచర్లు నిర్వహిస్తున్న పాత్ర ప్రశంసనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు ముఠా జయసింహ, స్కూల్ ప్రిన్సిపాల్ శాంత, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రాకేశ్కుమార్, ముచ్చకుర్తి ప్రభాకర్, గుండు జగదీశ్ బాబు, రవి శంకర్గుప్తా, ఎస్టీ ప్రేమ్, శ్రీకాంత్, బల్లా ప్రశాంత్, పి. సత్యనారాయణ పాల్గొన్నారు.
మూడు రోజులు .. లభ్యం కాని లక్ష్మి ఆచూకీ
కవాడిగూడ : సంజీవయ్యనగర్లో నివాసముంటున్న లక్ష్మి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. నాలా లో పడి గల్లంతైందా, లేక అదృశ్యమైందా అన్న విష యం మిస్టరీగానే మారింది. ఆదివారం మ ధ్యా హ్నం నుం చి మహిళ కనిపించకపోవడంతో కుటుం బ సభ్యులు గాంధీనగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యా ప్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు పోలీస్ బృందాలు, ఐదు డిజాస్టర్ టీమ్లు రం గంలోకి దిగి లక్ష్మి ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. బుధవారం నుంచి నల్లగొండ, సూర్యాపేట పోలీస్స్టేషన్ల పరిధిలోని నాలాల పరిధిలో గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు గాంధీనగర్ ఇన్స్పెక్టర్ నునావత్ రవి తెలిపారు.