మూసాపేట, డిసెంబర్ 15: ప్రమాదవశాత్తు బైక్పై నుంచి పడి బ్యాంకు ఉద్యోగి మృతి చెందాడు. కూకట్పల్లి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఎర్రగడ్డ ప్రేంనగర్కు చెందిన కాడి ఆనంద్ కుమార్(32) ఎస్బీఐ బ్యాంకు ఉద్యోగి. బుధవారం రాత్రి ఆల్విన్ కాలనీ నుంచి తన ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా.. వాహనం అదుపుతప్పి కిందపడిపోయాడు. దీంతో అతడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే 108తోపాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సంఘటనా స్థలానికి వచ్చిన 108 సిబ్బంది పరిశీలించగా అతడు అప్పటికే మృతి చెందాడు. మృతుడి సోదరుడు ఉప్పుగంటి వంశీకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.