అధికారం ఇస్తే రంగారెడ్డి-నల్గొండ జిల్లాల సరిహద్దులోని రాచకొండ ప్రాంతంలో 50వేల ఎకరాలను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ మాస్టర్ప్లాన్ వేసింది. ల్యాండ్పూలింగ్ తరహాలో భూములను సేకరించి.. ఆ భూములను వివిధ కంపెనీలకు విక్రయించేందుకు కుట్రలు పన్నుతున్నది. రాచకొండ భూములను అమ్మేసి ఆ డబ్బులతో ఆరు గ్యారంటీలను అమలుచేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు స్వయంగా ప్రకటించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆకారమే లేని అమరావతిని ఆదర్శంగా తీసుకుంటామన్న రేవంత్ వ్యాఖ్యలపై రాచకొండ వాసులు భగ్గుమంటున్నారు. సెంటు భూమి కూడా ఇచ్చేది లేదని, అవసరమైతే మరో ఉద్యమానికి సిద్ధమని రైతులు చెబున్నారు. తమ భూములపై కన్నేసిన కాంగ్రెస్ను ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిస్తామని శపథం చేశారు.
– ఇబ్రహీంపట్నం, నవంబర్ 9
కొల్లగొట్టేందుకు మాస్టర్ప్లాన్ వేసింది. ల్యాండ్పూలింగ్ తరహాలో భూములను సేకరించి.. ఆ భూములను వివిధ కంపెనీలకు విక్రయించేందుకు కుట్రలు పన్నుతున్నది. వచ్చే డబ్బులతో ఆరు గ్యారంటీలను అమలుచేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు స్వయంగా ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆకారమే లేని అమరావతిని ఆదర్శంగా తీసుకుంటామే రేవంత్ వ్యాఖ్యలపై రాచకొండ వాసులు భగ్గుమంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందే ఇలాంటి కుట్రలకు తెరలేపటంతో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
గతంలోనే రాచకొండ ప్రాంతం పరిసర ప్రాంతాల్లో ఫీల్డ్పైరింగ్ రేంజ్ను ఏర్పాటు చేయాలని అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధంచేయగా.. నల్గొండ జిల్లాలోని నారాయణపురం, అల్లాపురం, అల్లాపురంతండా, తుంబాయితండా, ఐదోనలతండా, రాచకొండతండా, రంగారెడ్డిజిల్లాలోని తిప్పాయిగూడ, పటేల్చెర్వుతండా, కడీలబావితండా, ఆరుట్ల తదితర గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. సర్వేకోసం వచ్చిన అధికారులపై కర్రలు, రాళ్లతో దాడులకు దిగడంతో పాటు పెట్రోల్పోసి తగులబెట్టే ప్రయత్నం చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఫీల్డ్ ఫైరింగ్రేంజ్ ప్రతిపాదనలు ఉపసంహరించుకుంది.
ఈ పరిస్థితిలో మరోమారు కాంగ్రెస్ నాయకులు ఈ భూములపై కన్నేయడాన్ని రైతులు జీర్ణియించుకోలేకపోతున్నారు. అధికారంలోకి రాక ముందే రేవంత్రెడ్డి రైతులకు వ్యతిరేకంగా కుట్రలకు తెరదీస్తున్నారని, ఇక ప్రభుత్వంలో ఉంటే ఇంకెంత కుయుక్తులు చేస్తారోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడగొడతామని శపథం చేస్తున్నారు. ఫైరింగ్ రేంజ్ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని మరోమారు కాంగ్రెస్ కుట్రలను తిప్పికొడుతామని హెచ్చరిస్తున్నారు.
– ఇబ్రహీంపట్నం/ యాదాద్రి భువనగిరి, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ)
మా భూములు లాక్కుంటే ఊరుకునేది లేదు. మీ పార్టీ గొప్పలకు పోయి గ్యారంటీలు ఇచ్చుడేంది. తర్వాత మా భుములను అమ్మి హామీలు చేస్తాననడం ఏంది. తాతల తరాల నుంచి వాటినే నమ్ముకొని ఉన్నాం. మాకు జీవనాధారమే ఈ భూములు. ఈ భూముల్లో బర్రెలు, గొర్రెలను మేపుకోవడమే కాకుండా పంటలు కూడా పండించుకుంటున్నం. అలాంటి భూములను తీసుకుంటామంటే ఎంతటి
వరకైనా సిద్ధమే.
– కరంటోతు భాస్కర్నాయక్,ఎనగండితండా, చౌటుప్పల్
మా నాన్నకు మాతాత, నాకు మా నాన్న వారసత్వంగా భూములను సాగుచేసుకుంటూ బతుకుతున్నాం. భూములుంటేనే మా పిల్లలు, మా పిల్లల పిల్లలకు వారసత్వంగా ఆస్తిని అందించిన వారమవుతాం. కానీ, ఎవరో వచ్చి భూములు తీసుకుని డబ్బులిస్తామంటే, మేము భూములు ఇవ్వము. భూములుంటేనే చూసుకుని ధైర్యంగా బతుకొచ్చు. పైలసిస్తే అవేమీ చేయాలో మాకు తెలియదు. మా భూముల జోలికెవరొచ్చినా ఊరుకోం.
– మెగావత్ గన్నా, తిప్పాయిగూడ
రాచకొండ ప్రాంతంలోని 50 వేల ఎకరాల భూములను అమ్మి గ్యారంటీ పథకాలకు డబ్బులు సమకూరుస్తామన్న కాంగ్రెస్ పార్టీని ఓడగొడుతం. రేవంత్రెడ్డికి పిచ్చి పట్టి మాట్లాడుతున్నడు. రైతులన్నా, వ్యవసాయమన్నా ఆయనకు గౌరవం లేదు. రైతు క్షేమం కోసం ఆలోచించే సీఎం కేసీఆర్ను చూసి కాంగ్రెసోళ్లు నేర్చుకోవాలి. రేవంత్రెడ్డికి రైతుల ఉసురు తగులుతది. చేతగాని హామీలు ఇవ్వొ ద్దు.. భూముల జోలికి రావద్దు. రాచకొండ రైతులమంతా కాంగ్రెస్కు ఓటుతో బుద్ధి చెబుతాం.
కాంగ్రెస్ పార్టీని నేడు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కాంగ్రెస్ అంటేనే ఓ భూటకం. అందులో ఉన్న నాయకుడు అధికారంలోకి రాకముందే రాచకొండ భూములను కంపెణీలకు అమ్ముకుంటామని చెబుతుంటే సిగ్గుగా ఉంది. పిల్ల పుట్టముందుకే.. కుల్లకుట్టినట్లుగా రేవంత్రెడ్డి మాటలున్నాయి. రాచకొండ భూముల జోలికి గతంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఫీల్డ్ఫైరింగ్ పేరుతో భూములు గుంజుకోవటానికి వస్తేనే గిరిజన రైతులంతా ఏకమై తరిమికొట్టడంతో మళ్లీ ఇక్కడకు ఏ ఒక్కడు రాలేదు. ఇప్పుడు ఎవరైనా వస్తే వారికి మరోసారి బుద్ది చెప్పక తప్పదు.
– రాజూనాయక్, పటేల్చెర్వుతండా
ఎన్నో ఏండ్లుగా వ్యవసాయాన్ని నమ్ముకొని బతుకుతున్నం. సీఎం కేసీఆర్ ఇస్తున్న రైతుబంధు పుణ్యమా అని పెట్టుబడి బాధ తప్పింది. రాచకొండ ప్రాంతంలో 50 వేల ఎకరాల భూమిని సేకరించి వాటిని బడా కంపెనీలకు అమ్ముతానని రేవంత్రెడ్డి అనడం ఆశ్చర్యమేసింది. ఆ భూములను అమ్మి కాంగ్రెస్ పథకాలకు ఖర్చు పెట్టడమేంటి. మా భూముల జోలికొస్తే చూ స్తూ ఊరుకోం. రేవంత్రెడ్డిని తరిమి కొడుతాం.
– నేనావత్ బంతిలాల్, అంతంపేట ఎంపీటీసీ, మర్రిగూడ
సీఎం కేసీఆర్ మా గిరిజన తండాల ప్రజలు పడుతున్న గోసలను అర్థం చేసుకుని పోడు భూములకు పట్టాలు ఇచ్చారు. రైతుబంధు, రైతుబీమా పథకాలను అందించి అండగా నిలబడ్డారు. మా భూములు గుంజుకుని కా ర్పొరేట్ సంస్థలకు అప్పజెప్పాలని చూస్తున్న రేవంత్రె డ్డి బెదిరింపులకు భయప డం. రాచకొండ ప్రాంతంలో అడుగు పెడితే తరిమి కొడుతాం.
– పానుగోతు పాండూనాయక్, సర్పంచ్, వెంకంబావితండా, సంస్థాన్నారాయణపురం
మా భూముల జోలికి ఏ దార్ఖాడు వచ్చినా ఉరికించి కొడతాం. మా భూములను ఎన్నో ఏళ్లుగా పంటలు సాగుచేసుకుంటూ బంగారంగా చూసుకుంటున్నాం. ఎవరెవరో వచ్చి ఓసారి ఫీల్డ్ఫైరింగ్ పెడతామంటేనే ఉరికించి కొట్టాం. మల్లా ఇంకోగాయన వచ్చి రాచకొండ భూములను కంపెనీలను ఇస్తామంటే మేము చేతులు మడుచుకుని కూసోము. ఎవరైనా మా భూమముల దగ్గరకు రావాలంటే ముందు మమ్ములన్ని ఎదుర్కోవాలి.
ఉదయం లేచినప్పటి నుంచి భూమిలో పంటలు సాగుచేసుకుంటేనే మా జీవనం సాగుతుంది. ఈ భూమిని నమ్ముకునే మా కుటుంబాలు జీవిస్తున్నాయి. అలాంటి బంగారంలాంటి భూములను ఎవరో వచ్చి గద్దల్లా తన్నుకుపోతామంటే చూస్తూ ఎలా ఊరుకుంటాం. మేము భూమిని నమ్ముకున్నాం. మాకు అన్నంపెట్టే భూమిని గుంజుకోవాలని చూస్తే ఊరుకోం.
– జర్పుల లక్ష్మి , కడీలబావితండా
మా తాతలు, మా అయ్యలు ఎంతో కష్టపడి సంపాదించిన భూములను మా ప్రాణంపోయినా వదులుకోం. ఎవరో వచ్చి మా భూములను ఎంతోఅంత ఇచ్చి తీసుకుంటామంటే ఒప్పుకోం. మాకు అన్నంపెట్టే భూముల జోలికొస్తే ఎంతటివారినైనా తరిమికొడతాం.
– ధర్మానాయక్, పటేల్చెర్వుతండా