Bachupally | దుండిగల్, మార్చి 22: సైబరాబాద్ కమిషరేట్ పరిధిలోనే మోడల్గా రూపుదిద్దుకున్న బాచుపల్లి పోలీస్స్టేషన్ భవనం ప్రారంభానికి సిద్ధమైంది.
సుమారు 2 ఎకరాల సువిశాలమైన స్థలంలో రూ.3.5 కోట్ల వ్యయంతో 21వేల చదరపు అడుగుల్లో జి+2 అంతస్తుల్లో నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని శుక్రవారం రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి మల్లారెడ్డి, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, తదితరులు ప్రారంభించనున్నారు.