పీర్జాదిగూడ, డిసెంబర్7: రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థిని మృతి చెందింది. ఈ సంఘటన మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోట చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…సిరిసిల్ల పట్టణం, శివానగర్కు చెందిన దాసరి బాస్కర్ కూతురు హాసిని (18) ఘట్కేసర్ మండల పరిధిలోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతూ హాస్టల్లో ఉంటుంది. కాగా శనివారం తన స్నేహితుడు అక్షయ్తో కలిసి బుల్లెట్ బైక్పై ఉప్పల్కు వెళ్లారు.
తిరిగి రాత్రి 2 గంటల సమయంలో ఘట్కేసర్ వైపు వస్తుండగా నారపల్లి జైన్ అపార్ట్మెంట్ సమీప ప్రాం తంలోకి రాగానే బైక్ అదుపు తప్పి కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో వెనుకాల కూర్చున్న హాసిని తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. స్వల్ప గా యాలైన అక్షయ్ సికింద్రాబాద్లోని ప్రైవే టు దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసున్నట్లు పోలీసులు తెలిపారు.