హైదరాబాద్ : సిటీ బస్ డ్రైవర్పై ఓ ఆటో డ్రైవర్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ మాసబ్ట్యాంక్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. ఎన్ఎండీసీ బస్టాప్ వద్ద వద్ద ఆర్టీసీ బస్సులు ఆగేచోట.. ఆటోను నిలుపడంతో.. బస్ డ్రైవర్ యాదయ్య ఆటోను పక్కకు తీయాలని కోరాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆటో డ్రైవర్ బస్సులోకి దూసుకువెళ్లి.. డ్రైవర్ను కిందకు లాగుకుంటూ వచ్చి విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న పలువురు ఆపేందుకు ప్రయత్నించినా దాడికి పాల్పడ్డాడు. గాయపడ్డ యాదయ్యను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బస్ డ్రైవర్పై దాడి చేసిన ఆటో డ్రైవర్పై హుమాయున్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. ఆటో డ్రైవర్పై దాడిని ఖండించిన ఈయూ ఖండించింది.