హైదరాబాద్ : కొవిడ్ వ్యాక్సిన్ నిల్వలేదన్న కారణానికి ఆగ్రహం చెందిన ఓ వ్యక్తి ఏఎన్ఎం, ఆశా కార్యకర్తపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్లోని ఖైరతాబాద్లో గల వెల్నెస్ సెంటర్లో బుధవారం చోటుచేసుకుంది. వ్యాక్సిన్ కోసం రాజేశ్ అనే వ్యక్తి వెల్నెస్ సెంటర్కి వచ్చాడు. స్లాట్ బుకింగ్లో టెక్నికల్ ప్రాబ్లమ్ వస్తుందని.. తనకు వ్యాక్సిన్ కచ్చితంగా ఇవ్వాల్సిందేనని వాగ్వివాదానికి దిగాడు. వ్యాక్సిన్ నిల్వ లేదు అని చెప్పడంతో ఆగ్రహంతో రాజేశ్ ఇరువురిపై దాడికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.