తెలుగు యూనివర్సిటీ, జూన్ 8: నిలోఫర్ దవాఖానలో విధులలో ఉన్న వైద్యులపై ఇటీవల రోగి సహాయకులు దాడులకు పాల్పడటాన్ని నిరసిస్తూ సోమవారం పీజీ వైద్యులు విధులు బహిష్కరించి దవఖాన ఆవరణలో ఆందోళన చేపట్టా రు. దీంతో దవఖాన వైద్య సేవలలో అంతరా యం ఏర్పడటంతో రోగులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. ఈ విషయమై దవాఖానలో భధ్రతను పర్యవేక్షించే ఎస్పీఎఫ్ పోలీసులకు, దవఖాన పరిపాలనా అధికారి, నాంపల్లి పోలీసులకు ఫిర్యాదులు చేసినా ఎవరూ పట్టించుకోలేదని వారు తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వైద్యులు విష్ణు, ధీరజ్, వంశీ మాట్లాడుతూ.. దాడి జరిగి మూడు రోజులు జరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడానని తీవ్రం గా ఖండిస్తున్నామన్నారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవడంతో పాటు ఇలాంటివి పునరావృతం కాకుండా వైద్య సిబ్బ ందికి భధ్రత కల్పించాలని వారు డిమాండ్ చేశారు. వైద్యుల నిరసన విషయం తెలుసుకున్న నాంపల్లి పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ విషయంపై సూపరింటెండెంట్ డాక్టర్ విజయకుమార్ను సంప్రదించగా విచారణ అనంతరం నిందితులపై చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు..