మల్లాపూర్, ఏప్రిల్ 16 : ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలతో అన్ని కులాలకు సముచిత న్యాయం చేస్తున్నారని మేడ్చల్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఆదివారం మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్1లో కార్పొరేటర్ పన్నాల దేవేందర్రెడ్డి అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, ఎంబీసీ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్తో కలిసి హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో పని చేస్తూ పార్టీని మరింత ముందుకు తీసుకువెళ్లాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. దేశంలో అన్ని రాష్టాల కంటే తెలంగాణే ఎక్కువ సంపాదన ఇస్తుందన్నారు. ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి మాట్లాడుతూ మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు పల్లా కిరణ్కుమార్రెడ్డి, తండా వాసుదేవ్గౌడ్, అనుబంధ సంస్థల అధ్యక్ష, కార్యదర్శులు, ప్రజా ప్రతి నిధులు, నాయకులు, కార్యకర్తలు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.