మియాపూర్, డిసెంబర్ 24: ఆపదకాలంలో అండగా నిలుస్తూ పేదల ఆరోగ్యానికి సీఎం సహాయ నిధి భరోసాగా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లకు చెందిన బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.3.04లక్షల ఆర్థిక సాయం చెక్కులను విప్ గాంధీ శనివారం తన నివాసంలో లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ.. పేదరికంతో బాధపడుతూ అనారోగ్యాలకు గురవుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి పూర్తి విశ్వాసం కల్పిస్తుందని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అహర్నిషలు కృషి చేస్తున్నారని , వారి బాగోగులే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఎందరో అభాగ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆసరాగా నిలిచి బతుకుపై భరోసానిచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు రంగారావు, రవీందర్, సంజీవరెడ్డి, చంద్రకాంత్రావు, కాశీనాథ్, అనీల్ పాల్గొన్నారు.
క్రిస్మస్ను ఆనందంగా జరుపుకోవాలి
క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని నియోజకవర్గంలో క్రిస్టియన్లకు విప్ గాంధీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్టియన్లు తమ పండుగను కుటుంబ సభ్యుల నడుమ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ క్రిస్మస్ పండుగకు కానుకలను అందించటం ద్వారా మరింత ఘనంగా వేడుకలను జరుపుకునేలా ప్రోత్సహిస్తున్నారన్నారు. పండుగ నేపథ్యంలో నియోజకవర్గంలోని అన్ని చర్చీల వద్ద తగు ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
మాదాపూర్, డిసెంబర్ 24: డివిజన్ పరిధిలోని యూత్ కాలనీలో హఫీజ్పేట్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు శభాన అంజూమ్ ఆధ్వర్యంలో శనివారం మహిళా సోదరీమణుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే, విప్ గాంధీ స్థానిక నాయకులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … కాలనీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని, ముఖ్యమంత్రి మహిళా సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, మహిళలు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మహిళా భవనం అందుబాటులోకి తీసుకురావాలని కాలనీ మహిళలు అడుగగా విప్ గాంధీ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, తాహీర్, సుదేశ్, కుమార్, కలీల్, ఇమ్రాన్, నజియా భేగం, తేజమ్మ పాల్గొన్నారు.