మేడ్చల్, అక్టోబర్3 (నమస్తే తెలంగాణ): డయాలసిస్ పేషేంట్లకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 399 మంది డయాలసిస్ పేషేంట్లను గుర్తించి వారికి ఆసరా పింఛన్లను మంజూరు చేసింది. కలెక్టరేట్లో సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి ఆసరా పింఛన్ల కార్డులను పంపిణీ చేశారు.
అదేవిధంగా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి 13 వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా వినతులను పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్యాంసన్, రెవెన్యూ జిల్లా అధికారి లింగ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.