హైదరాబాద్ : గంజాయి(Ganja) రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 30 కిలోల గంజాయి, ఆటో, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఇద్దరు నిందితులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గంజాయిని కొనుగోలు చేసి ఆటోలో తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు నగరంలోని మైలార్దేవ్పల్లి(mailardevpally) వద్ద తనిఖీలు చేపట్టి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.