బండ్లగూడ : వేర్వేరు ప్రాంతాలలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి 950 గ్రాముల ఎండు గంజాయి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ ఎక్సైజ్ పోలీసుల కథనం ప్రకారం…
అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నట్లు విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు కోకాపేట్ ప్రాంతంలో తనిఖీలు జరపగా ఇద్దరు వ్యక్తులు 950 గ్రాముల ఎండు గంజాయిని ద్విచక్ర వాహనంలో తరలిస్తూ పట్టు బడ్డారు.
అదే విధంగా మరో సంఘటనలో రాజేంద్రనగర్ మండలం పరిధిలోని లక్ష్మిగూడ ఇందిరమ్మ గృహాలకు సమీపంలో ఒక వ్యక్తి ఎండు గంజాయి విక్రయిస్తుండగా అతనిని అరెస్ట్ చేసి అతని నుంచి 200 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.