పటాన్ చెరు : పట్టణంలో డిసెంబర్ 1వ తేదీన నిర్వహించ తలపెట్టిన వందేమాతరం ( Vande Mataram ) 150 వసంతాల సామూహిక గీతాలాపన కార్యక్రమ ఏర్పాట్లను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ( Mla Gudem Mahipar Reddy ) పరిశీలించారు.
గురువారం సాయంత్రం వివిధ శాఖల అధికారులతో కలిసి పటాన్ చెరు పట్టణంలోని నొవపాన్ పరిశ్రమ సమీపంలో గల ఖాళీ స్థలంలో కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు వివరించారు.
ఆయన మాట్లాడుతూ 30 వేల మంది విద్యార్థులు ఒకే సమయాన సామూహిక గీతాలాపన చేసేలా కార్యక్రమాన్ని తీర్చిదిద్దినట్లు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొనే వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో పటాన్ చెరు డీఎస్పీ ప్రభాకర్, సీఐ వినాయక్ రెడ్డి, జాతీయ రహదారుల సంస్థ డీఈ రామకృష్ణ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మండల విద్యా శాఖ అధికారి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.