సిటీబ్యూరో, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఏర్పాటుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండు రోజుల కిందట మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి పాలకమండలి ఏర్పాటు, స్టాండింగ్ కమిటీ ఎన్నిక ఆలస్యం, కమిషనర్ రొనాల్డ్ రాస్ వైఖరిపై సీఎంకు వివరించారు. వెంటనే సీఎం స్పందించి కమిషనర్కు ఫోన్ చేసి ఆదివారం తనను కలవాలని ఆదేశించారు.
దీనిపై కమిషనర్ సీఎంను కలిసే ప్రయత్నం చేసినప్పటికీ క్యాబినెట్ మీటింగ్, ఇతర కార్యక్రమాలలో బిజీగా ఉన్న కారణంగా కలవలేకపోయారు. సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని కమిషనర్ కలిసే అవకాశం ఉన్నది. ఇదిలా ఉండగానే మేయర్ కౌన్సిల్ ఏర్పాటుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని జీహెచ్ఎంసీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు.