అధికార లాంఛనాలతో చందూలాల్ అంత్యక్రియలు
పాల్గొన్న మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి
సంతాపం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్
ముగిసిన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం
జిల్లాలో విషాదఛాయలు
ములుగు, ఏప్రిల్16 (నమస్తే తెలంగాణ) : అశ్రునయనాలు, అధికారిక లాంఛనాలతో మాజీ మంత్రి అజ్మీరా చందూలాల్(67)కు అంతిమ వీడ్కోలు పలికారు. అభిమానులు, సన్నిహితు లు, టీఆర్ఎస్, ఇతర పార్టీల నాయకులు అంతిమయాత్రలో పాల్గొనగా, శుక్రవారం మధ్యా హ్నం రెండుగంటలకు అంత్యక్రియలు ముగిశా యి. ఆయన స్వగ్రామమైన ములుగు మండలం జగ్గన్నపేట గ్రామం సారంగపల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పెద్ద కొడుకు డాక్టర్ అజ్మీరా ప్రహ్లాద్ చందూలాల్ చితికి నిప్పంటించారు. అధికారిక లాంఛనాల్లో భాగంగా పోలీసులు గాల్లోకి మూ డు రౌండ్లు కాల్పులు జరిపారు. చందూలా ల్ మృతికి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారా వు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సేవలను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటన విడుదల చేశారు.
మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ప్రణాళికా సం ఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, శంకర్నాయక్, మాజీ ఎంపీ సీతారాంనాయక్, జడ్పీచైర్మన్ జగదీశ్వర్, కలెక్టర్ కృష్ణఆదిత్య చందూలాల్ పార్థివదేహం వద్ద నివాళులర్పించి, వీడ్కోలు పలికారు.
చందూలాల్ మృతితో ములుగు జిల్లా ప్రజ లు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. చందూలాల్ మృతి బాధాకరమంటూ ఎమ్మెల్యే సీతక్క సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పోరిక రవీందర్నాయక్, పంచాయతీ రాజ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకుడు మడుగూరి నాగేశ్వర్రావు, ఆవాస్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు భిక్షపతి, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ బు చ్చయ్య, సుధీర్యాదవ్, ఎంపీటీసీల ఫోరం జి ల్లా అధ్యక్షుడు విజయ్రాంనాయక్,ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు రవి నివాళులర్పించారు.
రాజకీయ ప్రస్థానం
ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత మాజీ మంత్రి అజ్మీరా చం దూలాల్. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కాకుండా ఉత్తర తెలంగాణలో జిల్లాల్లో గిరిజనుల ప్రతినిధిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రజల ఆశీస్సులతో సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా అంచెలంచెలుగా ఎదిగారు. అజ్మీరా మీటూనాయక్-మీరాబాయ్ దంపతుల మూడో సంతానం. 1957 ఆగస్టు 17న జన్మించారు. ఆయనది పూర్తిగా వ్యవసాయ కుటుంబం. మొద ట గ్రామంలో రేషన్డీలర్గా పనిచేశారు. ఆ త ర్వాత రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1981-85 వరకు జగ్గన్నపేట గ్రామ సర్పంచ్గా పని చేశారు. అనంతరం ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో చేరారు. 1983లో ములుగు నుంచి టీడీపీ అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో పో టీ చేసి ఓటమిని చవిచూశారు. తిరిగి 1985 లో టీడీపీ నుంచి భారీమెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొంది, ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన చందూలాల్, 1994లో జరిగిన ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేశారు. 1996, 1998లో జనరల్ స్థానమైన వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి అప్పటి ఎంపీ రామసహాయం సు రేందర్రెడ్డిని ఓడించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా లో జాయింట్ కిల్లర్గా పేరు తెచ్చుకొని రెండు ప ర్యాయాలు ఎంపీగా కొనసాగారు. 1994 నుంచి 1996 వరకు టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడిగా కొనసాగారు. 1996-97లో లేబర్ సంక్షేమ కమి టీ చైర్మన్గా, 1998-99లో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కమిటీ సభ్యుడిగా, పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీం కమిటీ సభ్యుడిగా, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్, ఎంపవర్మెంట్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా పనిచేశా రు. 1999 నుంచి 2001వరకు టీడీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. 2001 నుంచి 2003 వరకు ట్రైఫెడ్ డైరెక్టర్గా, 2003-2005 వరకు ట్రైకార్ చైర్మన్గా ఉన్నా రు. 2005లో కేసీఆర్ స్థాపించిన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2006లో టీఆర్ఎస్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియామకమయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ములు గు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ, పర్యాటక శాఖ మం త్రిగా 2018 వరకు పనిచేశారు. 2018 లో జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలైన చం దూలాల్ అనారోగ్య సమస్యతో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఇంట్లోనే ఉన్నారు.
ఇవి కూడా చదవండి
IPL 2021: చెలరేగిన దీపక్ చహర్.. పంజాబ్ 5 వికెట్లు డౌన్
కరోనాతో ఇన్చార్జి ఏటీడీవో మృతి