మియాపూర్, డిసెంబర్ 17 : ప్రజా అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలు పెరుగుతున్నా పచ్చదనం పెంపును అదేస్థాయిలో చిత్తశుద్ధితో చేపడుతున్నట్లు విప్ అరెకపూడి గాంధీ తెలిపారు. కాంక్రీట్ కారుణ్యంలో కాలనీ ప్రజలకు ఏమాత్రం ఆహ్లాదం దూరం కాకుండా పార్కులను పూర్తి స్థాయి వసతులతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. హైదర్న్గర్ డివిజన్ పరిధిలో సమతానగర్, నాగార్జున హోమ్స్లలో రూ.2.10కోట్ల నిధులతో చేపట్టనున్న పార్కు అభివృద్ధి, సీసీ నిర్మాణ పనులకు కార్పొరేటర్ శ్రీనివాసరావుతో కలిసి విప్ శనివారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. పార్కు స్థలాలు అన్యాక్రాంతం కాకుండా కాపాడుతూ వాటిలో పచ్చదనం, వాకింగ్ ట్రాక్, చిన్న పిల్లలక ఆట స్థలాలు వంటి వాటిని సమతానగర్ పార్కులో కల్పిస్తున్నామన్నారు. దైనందిన జీవితం ఉరుకులు పరుగులతో ఉంటున్నందున నివాస కాలనీల్లోనే పూర్తిస్థాయి వసతుల పార్కులు ఆహ్లాదాన్నందించేలా తీర్చిదిద్దటమే లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా కాలనీల్లో పార్కులను తగు సౌకర్యాలతో అందుబాటులోకి తీసుకువచ్చామని, ఈ ప్రక్రియను మున్ముందూ కొనసాగిస్తామని విప్ తెలిపారు.
ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కోసం కాలనీల్లో సౌకర్యవంతమైన రహదారుల నిర్మాణం చేపడుతున్నట్లు, యూజీడీ పనులు పూర్తయిన చోట రహదారుల నిర్మాణాలు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. అభివృద్ధి పనుల్లో ప్రజలను భాగస్వాములను చేస్తూ నియోజకవర్గ సమగ్ర పురోభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు విప్ గాంధీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాలనీవాసులు, బీఆర్ఎస్ పార్టీ నేతలు, మహిళా నేతలు తదితరులు పాల్గొన్నారు.
వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వరనగర్లో జరిగిన అయ్యప్ప పడి పూజా మహోత్సవంలో విప్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. మాజీ కార్పొరేటర్ రంగారావు, బీఆర్ఎస్ పార్టీ నేతలు, స్వాములు పాల్గొన్నారు.
కొండాపూర్ సిద్దిక్నగర్ నివాసి కిశోర్గుప్త హైదరాబాద్ నుంచి శబరిమలకు కాలినడకన వెళ్లి స్వామి దర్శనం అనంతరం తిరిగి నగరానికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా విప్ గాంధీ ఆయనను తన నివాసంలో అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నేతలు, బీఆర్ఎస్ నేతలు సత్యనారాయణ, మల్లేశ్, శ్రీనివాస్, పశుపతి, నటరాజ్, సంపత్, భరత్ పాల్గొన్నారు.