ముషీరాబాద్/మెహిదీపట్నం, జనవరి 10: విద్యుత్ లైన్లలో మరమ్మతుల కారణంగా గురువారం ఆసిఫ్నగర్ విద్యుత్ సబ్డివిజన్ పరిధిలోని పలు ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని మెహిదీపట్నం సీబీడీ ఏడీఓ బుధవారం ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు 11 కేవీ ఖాదీ భండార్ ఫీడర్, 11 కేవీ చాచానెహ్రు పార్కు ఫీడర్, 11 కేవీ క్రీసెంట్ హాస్పిటల్ ఫీడర్ ప్రాంతాల్లో , మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు 11 కేవీ అహ్మద్నగర్ ఓవర్హెడ్ ఫీడర్,11 కేవీ అహ్మద్నగర్ కేబుల్ ఫీడర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
టీఎస్ఎస్పీడీసీ ఆజామాబాద్ డివిజన్ 11కేవీ వైఎంసీఎ, బసంత్ కాలనీ, ఫీవర్ ఆసుపత్రి, మౌలానా అజాద్ నగర్ ఫీడర్ల పరిధిలో విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా గురువారం(నేడు) విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఆజామాబాద్ డివిజన్ ఏడీఈ ఎం.విజయభాస్కర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఉదయం 9:30 గంటల నుంచి 11:30గంటల వరకు వైఎంసీఎ ఫీడర్ పరిధిలోని నారాయణగూడ బ్లడ్ బ్యాంక్, లింగంపల్లి వాటర్ వర్క్సు, రాఘవేంద్ర స్వామి టెంపుల్, నృపతుంగ కాలేజ్ పోలీసు క్వార్టర్స్ పరిసర ప్రాంతాల్లో, ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు బసంత్ కాలనీ ఫీడర్ పరిధిలోని బసంత్ కాలనీ, లింగంపల్లి, వైశ్య హాస్టల్, వెంకటరమణ థియేటర్, జైన్మందిర్, కాచిగూడ ఎక్స్ రోడ్ సరిసర ప్రాంతాల్లో, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 4:30 గంటల వరకు ఫీవర్ ఆసుపత్రి ఫీడర్ పరిధిలోని అంజయ్య క్వార్టర్స్, ఫీవర్ ఆసుపత్రి, తెలంగాణ యువతి మండలి, బర్కత్పుర పెట్రోల్ బంక్ పరిసర ప్రాంతాల్లో, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మౌలానా ఆజాద్ నగర్ ఫీడర్ ఫరిధిలోని చెప్పల్ బజార్, కుమార్ థియేటర్, రహమత్బాగ్, పన్నాలాల్ బిల్డిం గ్, క్వాలిటీ గార్డెన్ పరిసర ప్రాంతాల్లో కరెంటులో అంతరాయం ఉంటుందని విద్యుత్ సిబ్బందికి వినియోగదారులు సహకరించా లని ఆయన కోరారు.