బేగంపేట్, డిసెంబర్ 30: ఓ యువతిని ప్రేమించి పెళ్ల్లి చేసుకుంటానని నమ్మించి ఏఆర్ కానిస్టేబుల్ మోసం చేశాడు. దీంతో విసుగు చెందిన ఆ యువతి తనకు న్యాయం చేయాలని కోరుతూ రాంగోపాల్పేట్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇన్స్పెక్టర్ లింగేశ్వర్ కథనం ప్రకారం… కార్వాన్కు చెందిన సాయికుమార్ (26) ఏఆర్ కానిస్టేబుల్. బేగంపేట్ ప్రకాశ్నగర్లో ఉంటున్న ఓ యువతి(24) ఎయిర్పోర్ట్లో అవుట్సోర్సింగ్ సూపర్వైజర్గా పని చేస్తోంది.
వీరిద్దరికి 8 నెలల క్రితం పరిచయం ఏర్పడింది. కలిసి తిరిగారు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుందామని చెప్పి సాయికుమార్ మాట ఇచ్చాడు. తీరా ఆ యువతి తనను పెళ్లి చేసుకోవాలని సాయికుమార్ను కోరగా మొఖం చాటేసి తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.