సిటీబ్యూరో,ఆగస్టు 25(నమస్తే తెలంగాణ): క్యాన్సర్ చికిత్సలో ప్రవేశపెడుతున్న అధునాతన చికిత్స ప్రక్రియలు, టెక్నాలజీ వివరాలను తెలుసుకునేందుకు ఇండోనేషియా గవర్నమెంట్ ప్రముఖులు, ప్రతినిధులు శుక్రవారం గచ్చిబౌలిలోని ఒమేగా హాస్పటల్ను సందర్శించారు. ఈ సందర్భంగా క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సభ్యులతో కలిసి చికిత్స విధానంలోని వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా క్యాన్సర్కు నాణ్యమైన చికిత్సను అందించడంలో దక్షిణ భారతదేశంలో అతి పెద్ద హాస్పటల్గా ఒమేగా నిలిచిందని వారు అభినందించారు.
ఇండోనేషియా గవర్నమెంట్ ఆధ్వర్యంలో క్యాన్సర్కు మెరుగైన చికిత్స కోసం ఆధునిక క్యాన్సర్ కేంద్రాలను స్థాపించే లక్ష్యంతో దేశంలోని ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాలలోని ప్రముఖ హాస్పటల్స్తో పాటు హైదరాబాద్లోని ఒమేగా హాస్పటల్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఒమేగాలో రోగులకు అందించే వైద్య సేవలు, రోగులకు ఇచ్చే ప్రాధాన్యతతో పాటు అత్యాధునిక టెక్నాలజీ, దేశంలోనే మొట్టమొదటిసారి ప్రవేశపెట్టిన రేడియేషన్ ప్రక్రియతో క్యాన్సర్ చికిత్స అందించే ఈథోస్ విధానాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఒమేగా హాస్పటల్స్ చీఫ్ సర్జికల్ అంకాలజిస్ట్, చైర్మన్ డాక్టర్ మోహన వంశీ, డైరెక్టర్ డాక్టర్ సీహెచ్ నమ్రత తదితరులు పాల్గొన్నారు.