మేడ్చల్, మార్చి11(నమస్తే తెలంగాణ): ధరణిలో పెండింగ్ సమస్యల పరిష్కారానికి నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ పేరుకే అన్నట్లు ఉన్నది. ఈ డ్రైవ్లో ఇప్పటివరకు కేవలం ఆరు వేల దరఖాస్తులను మాత్రమే పరిశీలించారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో పెండింగ్లో 10,251 దరఖాస్తులు ఉండగా, తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో 6 వేల అర్జీలను మాత్రమే పరిశీలించారు.
తొమ్మిది రోజుల్లో పెండింగ్లో ఉన్న దరఖాస్తులన్నీ పరిశీలించాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ ఆశించిన మేర ఆ ప్రక్రియ జరగలేదని తెలుస్తున్నది. దరఖాస్తుల పరిశీలన అనంతరం తహసీల్దార్లు జిల్లా కలెక్టర్ గౌతమ్కు జాబితాను సమర్పించారు. అయితే మిగిలిన 4,251 దరఖాస్తుల సంగంతేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. స్పెషల్ డ్రైవ్ పూర్తయిన నేపథ్యంలో మిగతా దరఖాస్తులు అసలు పరిష్కరించే అవకాశం ఉంటుందా.. ఉండదా.. అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.