కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 17 : గత ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని మరిచాయి.. ఫలితంగా నానా కష్టాలు ప డ్డాం.. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్ల కాలంలో ఎనలేని అభివృద్ధి చేశాం.. సాధ్యం కానీ పనులను సుసాధ్యం చేస్తూ అడుగడుగునా అభివృద్ధి చేసుకుంటూ ముందుకుపోతున్నామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులపై ప్రజాభిప్రాయ సేకరణతో పాటు మిగిలి ఉన్న పనులను పూర్తి చేసేందుకు క్షేత్రస్థాయిలో ప్రగతియాత్రపేరుతో చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుంది. సోమవారం కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని బాపునగర్, వీకర్సెక్షన్లో మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీశ్తో కలిసి చేపట్టిన 46వ రోజు పాదయాత్రకు స్థానిక మహిళలు పెద్ద ఎత్తున హారతులు పట్టుకొని కుంకుమతిలకం దిద్దుతూ.. పువ్వులు చల్లుతూ స్వాగతం పలికారు.
భవిష్యత్లో కనివినీ ఎరుగని పద్ధతుల్లో కాలనీల్లో మౌలిక సదుపాయాలను కల్పించడంతో పాటు ఎలాంటి సమస్యలు లేకుండా శాశ్వత పరిష్కారం చూపిన ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దీంతో పాటుగా మిగిలి ఉన్న మరికొన్ని పనులను సకాలంలో పూర్తి చేసేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని కాల నీవాసులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు దూదిమెట్ల సోమేశ్యాదవ్, మాజీ కౌన్సిలర్ సూర్యప్రభ, డివిజన్ ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, సీనియర్ నాయకులు కిశోర్ చారి, నార్లకంటి బాలయ్య, రమణారెడ్డి, శంకర్ముదిరాజ్, పోచయ్య, సుబ్బారావు, సుధాకర్రెడ్డి, జగదీశ్గౌడ్, కృష్ణ, పెంటయ్య, నాని, దేవేందర్, ప్రభాకర్ రెడ్డి, శ్రావ్య, వాణి, తదితరులు పాల్గొన్నారు.
జయంతి వేడుకల సందర్భంగా పలు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తనదైన శైలిలో ముద్ర వేసుకున్న షాపూర్నగర్కు చెందిన దళిత సంఘాల ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి సీహెచ్ రవీందర్ ఇటీవల రవీంద్రభారతిలో ప్రభుత్వం నుండి అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన.. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ను కలిశారు. ఎమ్మెల్యే.. ఆయనకు శాలువా కప్పి అభినందించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల ప్రతినిధులు కిషన్ రావు, ఎం.సత్యనారాయణ, ఎస్.యాదయ్య, బాలయ్య, జి.అశోక్, రాజు, నాగరాజు, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.