కాచిగూడ,జనవరి 9: పట్టాలు దాటుతుండగా కర్నూల్ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు ఈ సంఘటన కాచిగూడ రైల్వేస్టేషన్ పరిధిలో జరిగింది. హెడ్కానిస్టేబుల్ శ్రీరామ్రెడ్డి వివరాల ప్రకారం గుర్తుతెలియని వ్యక్తి(35)ఉందానగర్-తిమ్మాపూర్ మద్య పట్టాలు దాటుతుండగా అదేసమయంలో ఎదురుగా వచ్చిన కర్నూల్-కాచిగూడ ఎక్స్ప్రెస్ రైలు ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతుని ఒంటిపై తెలుపు రంగు చొక్క, నీలి రంగు జీన్స్ ప్యాంట్ ధరించి ఎత్తు 5.5 ఉన్నట్లు తెలిపారు. మృతుని వివరాల కోసం 8106801989లో సంప్రదించాలని శ్రీరామ్రెడ్డి కోరారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.