హైదరాబాద్ : డ్రగ్స్(Drugs case(అమ్ముతూ దొరికన స్టాన్లీ(Stanley) కేసు దర్యాప్తు(Investigation) కొనసాగుతున్నది. నిందితుడు సౌరభ్ను ఏడు రోజుల కస్టడీకి పంజగుట్ట పోలీసులు కోరారు. స్టాన్లీ ఆదేశాలతో గోవాలో డ్రగ్స్ తరలించే ముగ్గురిని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం గోవా జైలులో ఇద్దరు నిందితులు ఉన్నారు. మరో నిందితుడి కోసం టీఎస్ న్యాబ్ పోలీసులు గాలిస్తున్నారు. కాగా, అంతర్జాతీయ డ్రగ్ కింగ్(International drug king) పిన్ స్టాన్లీ(Pin Stanley) పోలీసులకు చిక్కాడు.
గోవా కేంద్రంగా దేశ, విదేశాల్లో డ్రగ్స్ను విక్రయిస్తూ..సరఫరా చేస్తున్న ఇవూలా ఉకోడా స్టాన్లీ (43)ని పంజాగుట్ట పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. అతని వద్ద నుంచి భారీగా మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతని వద్ద దేశ్యాప్తంగా 500 మంది డ్రగ్స్ కొనుగోలు చేస్తుండగా, అందులో ఏడుగురు హైదరాబాద్కు చెందిన వారు ఉన్నారు. టీఎస్న్యాబ్, హెచ్న్యూ, ఏసీపీ మోహన్ కుమార్ నేతృత్వంలోని పంజాగుట్ట పోలీసు అధికారులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టారు