హైదరాబాద్ : స్విమ్మింగ్పూల్లో(Swimming pool) మునిగి ఎనిమిదేళ్ల బాలిక(Girl died) మృతి చెందిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జీడిమెట్ల(Jeedimetla) ఎన్సీఎల్ సింధు అపార్ట్మెంట్ ప్లాట్ 510లో నివాసం ఉంటున్న నిఖిల్కుమార్ తన కూతురు ఆదిత్య గోళి(8) కిడ్స్ వరల్డ్ స్కూల్లో రెండవ తరగతి చదువుతుంది. ఆదిత్య గోళికి చిన్నప్పటి నుంచి మాటలు రాకపోవడంతో మూగగా మిగిలింది.
ఆదివారం చిన్నారిని తన తండ్రి నిఖిల్కుమార్ తమ గేటెడ్ కమ్యూనిటీ ఆవరణలో ఉన్న స్విమ్మింగ్ పూల్వద్దకు తీసుకెళ్లాడు. నిఖిల్ బట్టలు మార్చుకునేందుకు రూంలోకి వెళ్లగా స్విమ్మింగ్పూల్ పక్కనే ఉన్న చిన్నారి అందులో దూకింది. ఈత రాకపోవడంతో నీళ్లలో మునిగి మృతి చెందింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.