సిటీబ్యూరో, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీ పరిధిలో కుకల బెడదను నియంత్రించడం, కుక కాటు సంఘటనలను పునరావృతం కాకుండా నిరోధించడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ పటిష్ట చర్యలు చేపడుతున్నది. యానిమల్ వెల్ఫేర్ బోర్డు మార్గదర్శకాలను అనుసరించి నూతనంగా జంతు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. ప్రస్తుతం జంతు సంరక్షణ కేంద్రాలు ఫతుల్లాగూడ, చుడీబజార్, పటేల్ నగర్, కేపీహెచ్బీ, మహదేవ్పూర్లో ఉండగా అదనంగా కాటేదాన్, గోపన్పల్ల్లిలో జంతు సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
ప్రధానంగా శేరిలింగంపల్లి మండలంలో గోపన్పల్లి రెవెన్యూ గ్రామ సర్వే నంబరు 34లో 4320 చదరపు గజాల స్థలంలో జంతు సంరక్షణ కేంద్రంతో పాటు పశువుల దవాఖాన ఏర్పాటుకు సీఎస్ఆర్ పద్ధతిలో రాంకీ ఫౌండేషన్ స్వంత నిధులతో చేపట్టేందుకు ముందుకు వచ్చి పనులు చేపడుతున్నది. నిర్మాణ పనులు ప్రీకాస్ట్ పద్ధతిలో శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు తెలిపారు. ప్రత్యేక బోనులు ఏర్పాటు చేసి అందులో 80 కుకలను ఒక వారంలో ఉండేలా చర్యలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 13న బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగే స్టాండింగ్ కమిటీ సమావేశంలో సదరు రాంకీ ఏజెన్సీతో జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ సీఎస్ఆర్ పద్ధతికి ఒప్పందం కుదుర్చుకోనున్నారు.