బంజారాహిల్స్,ఆగస్టు 3: డా.బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలోని పలు కోర్సుల్లో చేరేందుకు గడువును ఆగస్టు 16దాకా పెంచినట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీతో పాటు ఎంఏ. ఎంకామ్. ఎంఎస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్సీ, పీజీ డిప్లొమా కోర్సులలో చేరేందుకు గడువును పెంచామన్నారు.
ఆయా కోర్సుల్లో చేరేందుకు విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రంలో లేదా యూనివర్సిటీ వెబ్సైట్లో తెలుసుకోవచ్చన్నారు.