హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ 125 అడుగుల విగ్రహాన్ని ఆయన జయంతి రోజైన ఏప్రిల్ 14న ఆవిష్కరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. వర్క్ ఏజెన్సీ ప్రతినిధులతో కలిసి విగ్రహ ఏర్పాటు పనులను ఆయన బుధవారం పరిశీలించారు. అనంతరం పనుల పురోగతిపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. అంబేద్కర్ సమున్నత విగ్రహం హైదరాబాద్ నడిబొడ్డున కొలువు దీరనున్నదని, స్మృతివనం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ట్యాంక్బండ్పై బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు పరిధిలో 36 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు కొనసాగుతున్నదని, అందులో 2 ఎకరాల విస్తీర్ణంలో 791 టన్నుల స్టీల్, 96 మెట్రిక్ టన్నుల ఇత్తడితో మొత్తంగా 125 అడుగుల ఎత్తయిన అంబేదర్ విగ్రహ నిర్మాణం పనులు చివరి అంకానికి చేరుకున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకాల మేరకు పనులు కొనసాగుతున్నాయని, ఏప్రిల్ 10 నాటికి పూర్తవుతాయని వెల్లడించారు. ప్రధాన విగ్రహంతోపాటు రాక్గార్డెన్, ల్యాండ్ సేపింగ్, ప్లాంటేషన్, మెయిన్ ఎంట్రన్స్, వాటర్ ఫౌంటేన్, సాండ్ స్టోన్ వర్స్, జీఆర్సీ, గ్రానైట్ ఫ్లోరింగ్, లిఫ్ట్, విగ్రహం వద్దకు చేరుకొనే మెట్లదారి, ర్యాంప్, బిల్డింగ్ లోపల ఆడియో విజువల్ రూమ్, ఫాల్స్ సీలింగ్ తదితర పనులు తుదిదశకు చేరుకున్నాయని తెలిపారు.