సిటీబ్యూరో, మే 1 (నమస్తే తెలంగాణ): రాజీవ్ స్వగృహ కార్పొరేషన్కు సంబంధించిన బండ్లగూడ (నాగోల్), పోచారం(ఘట్కేసర్)లలో మిగిలిన ఫ్లాట్ల కేటాయింపులు మంగళవారం జరుగనున్నాయని హెచ్ఎండీఏ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
ఏప్రిల్ 15వ తేదీ నాటికి టోకెన్ అడ్వాన్స్ కట్టిన వారి పేర్లతో పారదర్శకంగా లాటరీ విధానంలో ఎంపిక చేస్తున్నామని, ఉదయం 11 గంటల నుంచి పోచారం, బండ్లగూడలలో మిగిలిపోయిన ఫ్లాట్ల కేటాయింపులు లాటరీ ప్రక్రియ ద్వారా ఎంపిక జరుగుతుందన్నారు. టోకెన్ అడ్వాన్స్ కట్టిన దరఖాస్తుదారులు లాటరీ పద్ధతిని ప్రత్యక్షంగా చూడాలని అధికారులు సూచించారు. ప్రత్యక్ష ప్రసారం కోసం (https://www.facebook.com/IPRTelanganaGovt), https://youtube.com/@IPRTelanganaGovt)లో వీక్షించవచ్చని తెలిపారు.