Hyderabad | హైదరాబాద్ శ్యామవర్ణంలో మెరిసిపోయింది. హైటెక్స్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, ఎంజే మార్కెట్ వద్ద జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీలిరంగు లైట్లు బుధవారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యాంటీ మైక్రోబయాల్ వీక్ ( world anti microbial week – నవంబర్ 18-24)ను పురస్కరించుకుని గో బ్లూ ( Go Blue ) క్యాంపెయిన్ను నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో ) ఇటీవల పిలుపునిచ్చింది. ఈ మేరకు నగరంలోని పలు కట్టడాలకు జీహెచ్ఎంసీ అధికారులు నీలిరంగు లైట్లను ఏర్పాటు చేశారు. ఇదే విషయాన్ని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్కుమార్ ట్విటర్ ద్వారా తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Hyderabad | వేగంగా పెరిగిపోతున్న హైదరాబాద్.. సంగారెడ్డి వైపు బూమ్
అందమైన అమ్మాయి అడిగిందని కోటి ట్రాన్స్ఫర్ చేశాడు.. తీరా చూస్తే..