హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో (Shamshabad Airport) ప్రయాణికులు ఆందోళనకు దిగారు. ఉదయం 8 గంటలకు కలకత్తాకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. మరో విమానంలో పంపించకపోగా, తమకు కనీస సౌకర్యాలు కల్పించలేదని ప్రయాణికులు రన్వేపై ఆందోళనకు దిగారు. దీంతో ఎయిర్ ఇండియా సిబ్బంది వారికి మరో విమానంలో పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.