165 మంది ఫ్లైయింగ్ కేడెట్ల గ్రాడ్యుయేషన్ పరేడ్
ఆకట్టుకున్న తేజస్, సూర్యకిరణ్, సారంగ్ బృందాల విన్యాసాలు
సారంగ్ బృందం హెలీకాఫ్టర్ల విన్యాసాలు.. పారాచూట్ల ప్రదర్శన ఆకాశంలో కనువిందు చేసింది. శిక్షణ పూర్తయిన భారత వాయుసేనకు చెందిన 165 మంది ఫ్లైయింగ్ కేడెట్లు కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ శనివారం దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో కోలాహలంగా జరిగింది.
సిటీబ్యూరో, జూన్ 18 (నమస్తే తెలంగాణ): దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో శనివారం సందడి నెలకొన్నది. భారత వాయుసేనకు చెందిన 165 మంది ఫ్లైయింగ్ కేడెట్లు విజయవంతంగా శిక్షణ పూర్తి చేయడంతో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (సీవోఏఎస్) జనరల్ మనోజ్ పాండే ముఖ్యఅతిథిగా హాజరై కేడట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మొత్తం 165 మంది ఫ్లైట్ కేడెడ్లతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా తేజస్ ఎయిర్క్రాప్ట్, సూర్యకిరణ్, సారంగ్ బృందాల విన్యాసాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.