మన్సూరాబాద్, ఆగస్టు 25 : శివారు కాలనీల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తూ ప్రజలకు పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ హయత్నగర్ పరిధి బాలాజీనగర్ కాలనీలో మురుగునీటి సమస్య పరిష్కారం కోసం రూ. 20 లక్షలతో డ్రైనేజీ పైపులైన్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించడాన్ని హర్షిస్తూ బుధవారం కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే సుధీర్రెడ్డికి పుష్పగుచ్ఛం దజేసి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బాలాజీనగర్లో దశలవారిగా అభివృద్ధిపనులు చేపడుతూ రోడ్లు, పార్కుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి, టీఆర్ఎస్ అధ్యక్షుడు టంగుటూరి నాగరాజు, నాయకులు జక్కిడి రఘువీర్ రెడ్డి, కాలనీ అధ్యక్షుడు జి. మోహన్రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏ. శ్రీనివాస్ గౌరవ అధ్యక్షుడు కొండారెడ్డి, కాలనీవాసులు యాదగిరి రావు, సురేష్, మోహన్రెడ్డి, బిక్షపతి, అనిల్రెడ్డి, సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.