మలక్పేట, సెప్టెంబర్ 22: మహిళల కోసం ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన పోరాటానికి దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించటం చాలా సంతోషకరమైన విషయమని హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అనితా నాయక్ అన్నారు.
పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో శుక్రవారం ఆమె ఎమ్మెల్సీ కవితను కలిసి శుభాభినందనలు తెలిపారు.