హైదరాబాద్ : అబిడ్స్లో(Abids)ని ఫెర్నాండెజ్ దవాఖాన(Fernandes Hospital) వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల చిన్నారి చనిపోయిందని ఆరోపిస్తూ చిన్నారి బంధువులు ఫెర్నాండెజ్ దవాఖాన ముందు ఆందోళన(Agitation) చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఓ మహిళ మూడు రోజుల క్రితం ఫెర్నాండెజ్ దవాఖానలో మగబిడ్డకు జన్మనిచ్చింది. కాగా, మంగళవారం ఉదయం చిన్నారి చనిపోయిందని వైద్యులు తల్లిదండ్రులకు తెలియజేశారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే పిల్లాడు చనిపోయాడని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.