హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ఇండియా చాలెంజ్ కార్యక్రమం చేపట్టడం గొప్ప విషయమని నటి సుమయా రెడ్డి అన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా చాలెంజ్ భాగంగా జూబ్లీహిల్స్లోని జీహెచ్ఎంసీ పార్క్లో ఆమె మొక్కలు నాటి మాట్లాడారు.
రేపటి తరానికి మంచి ఆక్సిజన్ లభించాలంటే ప్రతి ఒక్కరు ఈ చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని కోరారు. అనంతరం తుషార్, నిహారిక కొణిదల,శృతికి గ్రీన్ ఇండియా చాలెంజ్ సవాల్ విసిరారు.