ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్
ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి పంచాయతీ రాజ్, ఆర్అండ్బీ శాఖల అధికారులతో సమీక్ష
ఆసిఫాబాద్టౌన్, మే 4 : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో స్థానిక ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి పంచాయతీ రాజ్, ఆర్అండ్బీ శాఖల అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కేంద్రం నుంచి తిర్యాణికి వెళ్లే రహదారి పనులను వేగవంతం చేయాలన్నారు. కలెక్టరేట్ భవనాన్ని జూన్లో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉమ్రి, గుండి వాగు వంతెనలతో పాటు డీఎంఎఫ్టీ నిధులతో చేపడుతున్న బీటీ రోడ్డు పనులను సత్వరమే పూర్తి చేయాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతో క్షేత్రస్థాయిలో నిర్మాణాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఎస్ఈ వెంకట్ రావు, రహదారులు, భవనాల శాఖ ఎస్ఈ రాజేందర్ నాయక్, ఈఈలు పెద్దయ్య, నర్సయ్య, డీఈఈలు భీం సింగ్, ఆనంద్ కుమార్, ఈఈ గుణవంత్ రావు, తదితరులు పాల్గొన్నారు.