బీదర్లోని భంగూర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భారీ కంటైనర్ను కారు డీకొనడంతో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. దైవ దర్శనం కోసం వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మృతులు హైదరాబాద్ బేగంపేటకు చెందిన వారిగా గుర్తించారు.
మరణించిన వారిని గిరిధర్ (45), ప్రియ (15), అనిత (30), మహేష్ (2), డ్రైవర్ జగదీష్ (35)గా గుర్తించారు. ఆస్పత్రిలో చేరిన ఐదుగురు గీత, రజిత, ప్రభావతి, షాలిని, హర్షవర్ధన అని తెలుస్తోంది. గిరిధర్ పోలీసు శాఖలో పనిచేస్తున్నట్లు సమాచారం. కలబుర్గి జిల్లా గంగాపూర్లో దత్తాత్రేయుడిని దర్శించుకునేందుకు ఒకే కుటుంబానికి చెందిన 10 మంది కారులో బయలుదేరగా.. ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.