హైదరాబాద్ : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హెచ్ఎండీ మాజీ డైరెక్టర్, రేరా కార్యదర్శి శివబాలకృష్ణను ఏసీబీ కోర్టు ఫిబ్రవరి 8 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. బాలకృష్ణనను ఏసీబీ అధికారులు చంచల్గూడ జైలుకు తరలించారు. కాగా, రెరా కార్యదర్శి, గతంలో హెచ్ఎండీఏ (HMDA) ప్లానింగ్ డైరెక్టర్గా పనిచేసిన శివబాలకృష్ణను (Shiva Balakrishna) అక్రమ ఆస్తుల కేసులో ఏసీబీ అరెస్టు చేసింది.
బుధవారం ఉదయం నుంచి శివబాలకృష్ణ ఇల్లు, కార్యాలయం, ఆయన బంధువుల ఇండ్లలో సోదాలు నిర్వహించిన అవినీతి నిరోధక శాఖ అధికారులు (ACB) గురువారం తెల్లవారుజామున 3 గంటలకు అదుపులోకి తీసుకున్నారు. రూ.100 కోట్లకు పైగా అక్రమాస్తులను గుర్తించిన అధికారులు.. లాకర్లు తెలిస్తే మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. బినామీల పేరుతో వందల కోట్ల ఆస్తులను కూడబెట్టినట్లు అనుమానిస్తున్నారు. ఇప్పటికే వారిని విచారించి కీలక వివరాలు సేకరించారు.