హైదరాబాద్ : అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పెన్షన్లు అందజేస్తాం. ఎవరు కూడా అధైర్య పడొద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం సనత్ నగర్లో ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు గుర్తింపు కార్డులను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జోడెడ్ల లాగా ఒకే విధంగా అమలు అవుతున్నాయి. సీఎం కేసీఆర్ సబ్బండ వర్ణాల సంక్షేమానికి కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
వజ్రోత్సవాల సందర్భంగా 10 లక్షల మందికి నూతనంగా పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.