Road Accident | హైదరాబాద్: సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్టమైసమ్మ దేవాలయం మలుపు వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై అతి వేగంగా వెళ్తున్న ఓ యువకుడు కట్ట మైసమ్మ దేవస్థానం మలుపు వద్ద విద్యుత్ స్తంభానికి ఢీ కొన్నాడు. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న సూరారం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడు నెల్లూరు జిల్లాకు చెందిన కృష్ణారెడ్డిగా గుర్తించారు. గండి మైసమ్మ వద్ద హాస్టల్లో ఉంటున్నాడు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు పేర్కొంటూ.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.