హైదరాబాద్ : దంత చికిత్స పొందుతూ ఓ యువకుడు మృతి(Died) చెందాడు. ఈ విషాదకర సంఘటన జూబ్లీహిల్స్లో(Jubilee Hills)ని ఎఫ్ఎంఎస్ డెంటల్ క్లినిక్(FMS Dental Clinic)లో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లక్ష్మీ నారాయణ(28) అనే వ్యక్తి దంత సమస్యతో ఎఫ్ఎంఎస్ దవాఖానలో చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. దీంతో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే తన కొడుకు మృతి చెందాడని లక్ష్మీనారాయణ తండ్రి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.