హైదరాబాద్ : అతివేగం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కరెంట్ ఫోల్(Current pole)ను కారు ఢీ కొట్టడంతో(Car accident) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి(Dundigal Police Station) భౌరంపేట్ రహదారిపై అర్ధరాత్రి చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. నలుగురు యువకులు కారులో వెళ్తుండగా అతి వేగంతో కారు నడిపి కరెంట్ పోల్ను ఢీ కొట్టడంతో సాయి నాథ్(22) అనే యువకుడు సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. కారులో ఉన్న మరో నలుగురికి గాయాలయ్యాయి.క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక దవాఖానకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివురాలు తెలియాల్సి ఉంది.