ఎల్బీనగర్, మార్చి 5 : రోడ్డు ప్రమాదంలో(Road accident) ఓ మహిళ మరణించిన(Woman died) విషాదకర సంఘటన సరూర్నగర్(Saroornagar) పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని వీ.ఎం. హోం వద్ద మంగళవారం తెల్లవారుజామున ఐదున్నర గంటల ప్రాంతంలో ఓ గుర్తు తెలియని వాహనం డీ కొని సాయమ్మ ( 50) అనే మహిళ తీవ్ర గాయపడింది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సాయమ్మను ఉస్మానియా దవాఖానకు తరలించగా అప్పటికే ఆమె మరణించిందని డాక్టర్లు నిర్ధారించారు. నారాయణ పేట జిల్లా ఉట్కూరు మండలం పెద్ద జట్రాం గ్రామానికి చెందిన సాయమ్మ నగరంలోని కుమారుడు మల్లేష్ ఇంటి వద్దకు వచ్చింది. తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో తీవ్ర గాయాలకు గురై మరణించింది. కుమారుడు మల్లేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.