Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. శివశక్తి బార్ సమీపంలోని హైటెన్షన్ స్తంభాన్ని ఓ గుర్తు తెలియని యువకుడు ఎక్కి హంగామా సృష్టించాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆ వ్యక్తిని విద్యుత్ స్తంభం నుంచి కిందకు దింపేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హైటెన్షన్ స్తంభం ఎక్కిన వ్యక్తి వివరాలు తెలియరాలేదు. అసలు అతను ఎందుకు విద్యుత్ స్తంభం ఎక్కాల్సి వచ్చింది..? ఎక్కడ్నుంచి వచ్చాడనే వివరాలు తెలియాల్సి ఉంది.