హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో(Road accident) టెక్ మహీంద్ర యూనివర్సిటీ(Tech Mahindra University) విద్యార్థి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన దుండిగల్(Dundigal) పరిధి అవుటర్ రింగ్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.