సిటీబ్యూరో, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : గచ్చిబౌలిలోని ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(త్రిబుల్ ఐటీ)లో పరిశోధన, అభివృద్ధి విభాగానికి సంబంధించి ప్రత్యేకంగా ఆర్ అండ్ డీ షోకేస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. 2024 సంవత్సరానికిగాను ‘ఇంటర్ కనెక్ట్’ అనే థీమ్తో మార్చి 16,17 తేదీల్లో కార్యక్రమం ఉంటుంది. ఆల్గారిథమ్స్, ఎథిక్స్, సొసైటీ అంశాలపై ప్రాజెక్టుల ప్రదర్శన, రీసెర్చ్ లీడర్స్తో ప్రసంగాలు, స్టార్టప్ షోకేస్, రౌండ్ టేబుల్ చర్చలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.