Hyderabad | హైదరాబాద్ : రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టాలు చవిచూడటంతో ఓ వ్యక్తి సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠాతో చేతులు కలిపాడు. ఇక ఇతర రాష్ట్రాల నుంచి దొంగిలించి తీసుకొచ్చిన ఫోన్లను ఇక్కడ అమ్ముతూ.. పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడిని సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. గచ్చిబౌలి చౌరస్తాలో రాయదుర్గం, మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పాత నేరస్తుడు గారడీ రామంజీ పట్టుబడ్డాడు. దీంతో అతని కారును తనిఖీ చేయగా.. 563 మొబైల్స్, రూ. 3 లక్షల నగదును పోలీసులు సీజ్ చేసినట్లు మాదాపూర్ డీసీపీ సందీప్ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలలో చోరీ చేసిన మొబైల్స్ తీసుకుని IMEI నెంబర్ మార్చి ఇక్కడ వేరే వారికి అమ్ముతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. రామంజీకి మొబైల్స్ సరఫరా చేస్తున్న, రిసీవ్ చేసుకుంటున్న ఐదుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతనిపై గతంలో రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని శామీర్పేట్, అబ్దుల్లాపూర్మెట్ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి.