మన్సూరాబాద్, : వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తి ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్బీనగర్, బ్యాంకుకాలనీ సమీపంలోని కృష్ణానగర్లో సాముల గణేష్ (47) తన భార్య ఉషారాణి, కుమారుడు, కూతురుతో కలిసి ఉంటున్నాడు.
సికింద్రాబాద్లో బంగారు ఆభరణాలు తయారు చేసే షాపును నడుపుతున్నాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు. సోమవారం ఉదయం యథావిదిగా షాపుకు వెళ్లిన గణేష్ మధ్యహ్నం 1:30 గంటలకు ఇంటికి వచ్చాడు. సాయంత్రం 4:30 గంటలకు సెల్లార్లో ఉండే తన గదిలోకి వెళ్లాడు. గదిలోకి వెళ్లి ఎంతకీ తిరిగి రాకపోవడంతో భార్య వెళ్లి డోర్ కొట్టగా ఓపెన్ చేయలేదు.
బలవంతంగా డోర్ను ఓపెన్ చేసి చూడగా గణేష్ ఫ్యాన్కు తాడుతో ఉరివేసుకుని కనిపించాడు. వెంటనే అతడిని సమీపంలోని అవేర్ గ్లోబల్ దవాఖానకు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య ఉషారాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు.