హైదరాబాద్ : జీడిమెట్ల(jeedimetla) ఠాణా పరిధి హెచ్ఎంటీ అటవీ ప్రాంతంలో(HMT forest area) ఓ వ్యక్తి దారుణ హత్యకు(Brutal murder ) గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు నిన్న రాత్రి మద్యం సీసాలతో తలపై దాడి చేసి హత్య చేశారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడు బిహార్(Bihar) రాష్ట్రానికి చెందిన రమేష్ రామ్(48)అనే వ్యక్తిగా గుర్తించారు. సీసీ కెమెరాల(CC cameras) ఆధారంగా పొలీసులు విచారణ చేపట్టారు. నిందితులను త్వరలో పట్టుకుంటామన్నారు. హత్యకి గల కారణాలు తెలియాల్సి ఉంది.